అమరావతి : సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న యువకులు ఇద్దరు రోడ్డు ప్రమాదం (Road Accident ) లో దుర్మరణం చెందడం ఇరువురి కుటుంబాల్లో విషాదం నింపింది. అల్లూరి జిల్లా (Alluri District) పాడేరు మండలం రాయిగెడ్డలో ఆగిఉన్న బైకును మరో బైకు ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి .మృతి చెందిన యువకులు పాడేరు మండలానికి చెందిన యువకులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తబెళగల్ వద్ద కూలీల ఆటో బోల్తా పడిన ఘటనలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. నిన్న దస్తగిరమ్మ మృతి చెందగా ఈరోజు షేకమ్మ కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది కూలీలు గాయపడ్డారు.