అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనం జీపు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కడప ( Kadapa ) జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద కడప నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనాన్ని అతివేగంగా వచ్చిన జీపు ఢీ కొట్టింది. దీంతో జీపులో ఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బొలేరోలో ఉన్న డ్రైవర్ , కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.