అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆబ్కారీ, పోలీసులు జరిపిన ఏకకాల సోదాల్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు జిల్లాలో సాగిన సోదాల్లో దాదాపు మూడు వందల కిలోల వరకు ఉన్న గంజాయిని పట్టుకున్నారు. విశాఖ నుంచి కేరళకు కారులో తరలిస్తున్న గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని మంగళగిరి పోలీసులు అరెస్టు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 168 కిలోల గంజాయిని అరకునుంచి విశాఖకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.