అమరావతి : ఏనుగుల గుంపు వరుస దాడులతో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.రెండు రోజుల క్రితం జిల్లాలోని మిర్తివలస గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగులు దాడి చేయగా రెండు ఆవులు మరణించాయి. ఈ ఘటనను మరువకముందే మరోసారి ఏనుగులు మిర్తివలస గ్రామంలోకి ప్రవేశించి రైసుమిల్లుపై దాడులకు ఎగబడ్డాయి.
రైస్మిల్లులోని అరటి మొక్కలను ధ్వంసం చేశాయి. రైస్మిల్లు షట్టర్లు ధ్వంసం చేసి 10 సంచుల బియ్యం తిన్నాయని, నిల్వచేసిన ధాన్యం బస్తాలను చెల్లాచెదురు చేశాయని మిల్లు నిర్వాహకులు తెలిపారు. అధికారులు స్పందించి ఏనుగులను అటవీప్రాంతంలోకి తరలించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.