Crime | ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో 11 ఏండ్ల బాలిక ఇంటికెళ్లి.. మాయ మాటలు చెప్పి లైంగిక దాడి చేశారు.
తర్వాత ఈ సంగతి బయటికి చెప్పినా, పోలీసులకు చెప్పినా చంపేస్తామని నిందితులు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితురాలు బాలిక, ఆమె కుటుంబ సభ్యులు ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండి పోయారు.
తల్లి దండ్రులు పనికోసం బయటకు వెళ్లిన తర్వాత శుక్రవారం మరోమారు ఆ బాలికపై లైంగిక దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు.. మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.