తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 62,925 మంది దర్శించుకోగా, 36,297 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. గురువారం 4.23 లక్షల లడ్డూల విక్రయం జరిగిందన్నారు.2.40 లక్షల మందికి అన్న ప్రసాదం పంపిణీ జరిగిందన్నారు.
రూ.45 లక్షలు విరాళం..
హైదరాబాద్ కు చెందిన సాయి బాలాజీ డెవెలపర్స్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళం ( Donations ) గా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ భాగస్వామి శ్రీ ఆకుల రవి కుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.