AP News | హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో బుధవారానికి వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. 16 నాటికి తీవ్ర వాయుగుండంగా మారి కోస్తాంధ్రతీరం దగ్గరగా వచ్చే అవకాశమున్నట్టు పేర్కొన్నది.
తదుపరి దిశ మార్చుకొని 17న ఒడిశా తీరం వైపు తీవ్ర వాయుగుండం కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 15, 16న కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్న మయ్య, చిత్తూరు, తిరుపతి, కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తా రంగా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది. కోస్తాంధ్ర తీరంలో మత్స్య కారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.