అమరావతి : వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని (Perninani) సతీమణి జయసుధపై కేసు నమోదయ్యింది. వైసీపీ హయాంలో పేర్నినాని బందరు రోడ్లోని పొట్లపాడు గ్రామంలో భార్య జయసుధ పేరిట గిడ్డంగిని నిర్మించి సివిల్ సఫ్లైకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల 10 రోజుల క్రితం అధికారులు గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో బియ్యం నిల్లల్లో 185 టన్నుల రేషన్ బియ్యం వ్యత్యాసాలను గమనించి ఉన్నతాధికారులకు నివేదించారు.
గోదాంలో (Godown) రేషన్ బియ్యం (Ration Rice) నిల్వలో వ్యత్యాసాలు ఉన్నాయంటూ కృష్ణా జిల్లా పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి బందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాం యజమాని పేర్నినాని సతీమణి జయసుధతో పాటు, గోదాం మేనేజర్ మానస్ తేజపై కూడా కేసు నమోదు చేశారు. అయితే వ్యత్యాసం ఉన్న రేషన్ బియ్యానికి డబ్బులు చెల్లిస్తామని జయసుధ పేర్కొన్నారు.