అమరావతి : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.