అమరావతి: ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఎవరనేది వివరాలను సేకరిస్తున్నారు.