అమరావతి : బాపట్ల జిల్లాలో(Bapatla district) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident)చోటు చేసుకుంది. కారు, లారీ ఢీకొనడంతో ఓ చిన్నారి మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కొరిశెపాడు మండలం గుడిపాడు వద్ద ఆదివారం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఐదేండ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.