అమరావతి : కర్నూలు జిల్లా సీతారాంనగర్లో ఘోరం జరిగింది. ఓ ఇంట్లో తయారు చేస్తున్న బాణాసంచా ప్రమాదవాశాత్తు పేలి 14 ఏండ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామంలో రాజు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా బాణాసంచాల తయారి చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ప్రమాదవాశాత్తు పేలుడు సంబవించి ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి.
ఈ ఘటనలో బాలుడు (14) మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటిలో బాణాసంచా తయారి చేస్తున్న రాజుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.