తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. స్వామి వారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 73,420 మంది భక్తులు దర్శించుకోగా 27,621 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చిందని తెలిపారు.
సూర్యగ్రహణం కారణంగా అక్టోబరు 25న ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతామని వివరించారు. అనంతరం ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం, కైంకర్యాలు చేపడతారని తెలిపారు. నవంబరు 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటలకు అమ్మవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారని పేర్కొన్నారు. ఈ రెండు గ్రహణాల కారణంగా సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్ దర్శనాలతోపాటు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసిందన్నారు.