తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచియున్నారని వీరికి దర్శనం 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 77,541 మంది దర్శించుకోగా 39,533 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3. 87 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
అదే విధంగా రేపటి నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు నిలుపుదల చేసిన రూ.300/- దర్శన టికెట్ల కోటాను ఆగస్టు 2న ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 9, 10వ తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనాన్ని నిలుపుదల చేసినట్లు వివరించారు.