తిరుమల : వడ్డికాసులవాడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రెండు కంపార్టుమెంట్లలో(Compartment) దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 66,441 మంది భక్తులు దర్శించుకోగా 20,639 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.12 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.