హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని పెరంబూర్కు చెందిన యాత్రికులు శనివారం రాత్రి టెంపో వాహనంలో శ్రీశైలం నుంచి నెల్లూరుకు పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు శివారులో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నెల్లూరుకు చెందిన టెంపో డ్రైవర్ గుర్నాథరెడ్డితోపాటు వాహనంలో ముందుకూర్చున్న మరో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. మరో 8 మంది తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ కూడా చదవండి..
ఐఐటీ హైదరాబాద్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశాలు
ఈయన కూరగాయలు అమ్మే తీరే వేరయా?! వీడియో వైరల్