అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (AP Inter Results) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 67 శాతం మంది ఉత్తీర్ణులవగా, రెండో సంవత్సరంలో 78 శాతం ఉత్తీర్ణత నమోదయింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 81 శాతంతో గుంటూరు, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇక సెకండియర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో ఉండగా, 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ద్వితీయస్థానం, 84 శాతంతో విశాఖ జిల్లాకు తృతీయస్థానంలో నిలిచింది.
కాగా, ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 5,17,617, ద్వితీయ సంవత్సరం 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల వ్యవధిలోనే ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఫలితాలను ఇంటర్బోర్డ్ అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in లో చూడవచ్చు.