అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,213 మందికి కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి ఐదుగురు చనిపోయారు. 10,795 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని ఏపీ వైద్యాధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 903, గుంటూరు జిల్లాలో 830, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కేసులు నమోదయ్యాయని వివరించారు.