అమరావతి : తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మొత్తం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,154 మంది భక్తులు దర్శించుకోగా, 30182 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.4.62 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.