తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం 6 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 80,815 మంది భక్తులు దర్శించుకోగా 31,562 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.82 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.