హైదరాబాద్ : తెలంగాణా పోలీసుల ఎదుట దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా ఐతు ( Hemla Ietu ), డివిజనల్ కమిటీ సభ్యుడు పోడియం లచ్చు ( Lachu) అలియస్ మనోజ్ సహ 47 మంది అజ్ఞాత మావోయిస్టులు ( Maoists) డీజీపీ ఎదుట లొంగిపోయారు ( Surrender ) . వీరి నుంచి నాలుగు ఏకే 47 రైఫిళ్లు, మూడు ఎస్ఎల్ఆర్, తదితర 32 తుపాకులు పోలీసులకు అప్పగించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలిసిన క్యాడర్లకు తగిన ప్రోత్సహకాలు అందజేస్తామన్నారు. తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టు కేడర్లు మాత్రమే అజ్ఞాతంలో ఉండి తెలంగాణ వెలుపల వివిధ నిర్మాణాలలో పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ముప్పాల లక్ష్మణరావు, పసునూరి నరహరి జాడే రత్నబాయి, వార్తా శేఖర్ కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలువాలని కోరారు.