అమరావతి : కారులో తరలిస్తున్న సుమారు రూ. కోటి 40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగదుకు సంబంధించిన ఎలాంటి రశీదులు, ఆధారాలు లేకపోవడంతో కారును సీజ్ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా గరికపాడు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ కారును నిలిపి తనిఖీ చేయగా నగదు పట్టుబడింది.
కారులోని వారిని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో ఆదాయ పన్ను శాఖకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి