హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు వెళ్లి స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులను సాయిరెడ్డి(12), విష్ణురెడ్డి(13), బ్రహ్మారెడ్డి(14), మణికంఠ(14)గా పోలీసులు గుర్తించారు. మృతుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.