తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. వీరికి 38 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 82,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ,37,025 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని తెలిపారు.