కడప: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ టెంపో వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దవాఖానకు తరలించారు.
బాధితులను ప్రొద్దుటూరుకు చెందిన వారిగా గుర్తించారు. ప్రొద్దుటూరులోని వైఎమ్మార్ కాలనికి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని చెప్పారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.