కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు (Kurnool) పట్టణ శివార్లలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కర్నూలు శివార్లలోని రింగురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఓ కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతదేహాలను కారులోనుంచి బయటకు తీసి దవాఖానకు తరలించారు. ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.
కారు నంబర్ తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్నది. అయితే మృతులు రాయదుర్గానికి చెందిన గణేశ్, రుద్ర, సోమశేఖర్గా గుర్తించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం వారు షాక్లో ఉన్నారని, మాట్లాడలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.