TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు. టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులనాయుడు మనుమరాలు చైతన్య శ్రీవారికి స్వర్ణ వైజయంతీ మాలను కానుకగా అందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా వైజయంతీ మాలను శ్రీవారికి సమర్పించారు. ఈ స్వర్ణ మాలను శ్రీవారి ఉత్సవమూర్తులకు అలంకరించనున్నట్లు టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు. మరో స్వర్ణ వైజయంతీ మాలను తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సైతం కానుకగా సమర్పించనున్నట్లు చైతన్య తెలిపారు. శుక్రవారం పద్మావతి అమ్మవారిని దర్శించుకొని.. మాలను దేవస్థానానికి కానుకగా అందించనున్నట్లు ఆమె వివరించారు.