తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 28 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 59,752 మంది భక్తులు దర్శించుకోగా 26వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు వచ్చిందని వివరించారు.