అమరావతి : ఏపీలో కొత్తగా 262 మందికి పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 33వేల 362 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించామని వివరించారు. కొవిడ్ కారణంగా శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇద్దరు మృతి చెందారని తెలిపారు. కరోనా నుంచి 229 మంది కోలుకున్నారని, ప్రసుత్తం 3,227 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఏపీలో 2కోట్ల 99లక్షల,17,592 మందికి పరీక్షలు జరిపినట్లు వెల్లడించారు. అనంతపూర్ జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 38, తూర్పుగోదావరి జిల్లాలో 46 మంది , గుంటూరు జిల్లాలో 33, కృష్ణా జిల్లాలో 31 , విశాఖపట్నంలో 28 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 27 మంది కొవిడ్ బారిన పడ్డారని వివరించారు.