Vizag | వైజాగ్ తీరంలో డ్రగ్స్ కలకలం రేపాయి. బ్రెజిల్ నుంచి వైజాగ్ సీపోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి. ఇంటర్పోల్ సమాచారంతో సీబీఐ ఆపరేషన్ గరుడ చేపట్టింది. ఇందులో భాగంగానే వైజాగ్ తీరంలో భారీ ఎత్తున డ్రగ్స్ను సీజ్ చేసింది.
జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా ఈ నెల 16వ తేదీన ఈ కంటైనర్ విశాఖకు వచ్చినట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఈ కంటైనర్పై విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీ వివరాలతో డెలివరీ అడ్రస్ ఉంది. దీంతో ఆ అడ్రస్ ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కంటైనర్లో డ్రైఈస్ట్తో మిక్స్ చేసిన వెయ్యి బ్యాగుల్లో 25 వేల కిలోల డ్రగ్స్ను తరలించారు. ఒక్కో బ్యాగ్లో 25 కేజీల చొప్పున డ్రగ్స్ ఉన్నాయి.