అమరావతి : బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో (Bapatla Kendriya Vidyalaya) ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులకు అస్వస్థతకు ( Fell ill) గురయ్యారు. శనివారం 6,7వ తరగతులకు చెందిన విద్యార్థులు సైన్స్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.
పరీక్షలో క్లోరోక్విన్, లెమన్సోడాలో విద్యార్థులు సోడియం కలపడంతో ఒక్కసారిగా విషవాయువులు వెలువడి విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ప్రయోగం చేస్తుండగా టీచర్ మధ్యలోనే ల్యాబ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అస్వస్థకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) జిల్లా అధికారులు, వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని వైద్యాధికారులు సీఎంకు వివరించారు.