తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం 24 గంటల్లో కలుగుతుందని వివరించారు. నిన్న శ్రీవారిని 63,549 మంది భక్తులు దర్శించుకోగా 23,919 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.13 కోట్లు వచ్చిందని వెల్లడించారు.