తిరుపతి జిల్లా : తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. వారాంతపు సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.
రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు స్వామి వారి దర్శించుకునేందుకు మూడు, నాలుగు గంటల సమయం పట్టనున్నతి. నిన్న తిరుమల శ్రీవారిని 82,392 మంది భక్తులు దర్శించుకోగా.. వీరిలో 41,800 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.