తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . స్వామివారి దర్శనం కోసం భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి ఎస్ఎంసీ వరకు క్యూలైన్లో నిలిచియున్నారు. వీరికి 18 గంటల్లో దర్శనం కలుగు తుందని టీటీడీ అధికారులు తెలిపారు.నిన్న 65,634 మంది వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 31,419 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4 కోట్లు వచ్చిందని వెల్లడించారు.