తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. దర్శనానికి 16గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 68,128 మంది భక్తులు దర్శించుకోగా 34,021 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.44 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.