తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శని, ఆదివారాలు సెలువు దినం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగే అవకాశమున్నందున అందుకు తగ్గట్లుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. స్వామివారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి16 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికా రులు వెల్లడించారు. నిన్న శ్రీవారిని 67,425 మంది భక్తులు దర్శించుకోగా 32,693 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.86 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.