తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 16 గంటల్లో శ్రీవారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 86,793 మంది భక్తులు దర్శించుకోగా 30,254 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లు వచ్చిందని వివరించారు.