అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. 64,550 టెస్టులు నిర్వహించగా.. కొత్త కేసులు రికార్డయ్యాయని పేర్కొంది. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 20,12,123కు చేరింది. 24 గంటల్లో 1,213 మంది బాధితులు కోలుకోగా.. 18 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి నుంచి 19,83,119 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అవగా.. మొత్తం మృతుల సంఖ్య 13,825కు చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255, తూర్పుగోదావరిలో 232, పశ్చిమ గోదావరిలో 212, నెల్లూరులో 164, కృష్ణాలో 159, గుంటూరులో 127, ప్రకాశంలో 112 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షించారని ఆరోగ్యశాఖ వివరించింది.