తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 67,439 మంది భక్తులు దర్శించుకోగా 29,450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.60 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
కాగా నిన్న భువనేశ్వర్కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. సంస్థ తరఫున ఇప్పటివరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు రాఘవేంద్ర తెలిపారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తులసమ్మ, ఈశ్వర్ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.5.5 లక్షలు విరాళంగా అందించారు.