అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 14 మది ఐఏఎస్ అధికారులను బదిలీలు ( IAS Officers Tranfer ) చేస్తూ పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నూతనం ఏర్పడ్డ మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా పి.శ్రీనివాసులు ( P. Srinivasulu) , ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా కల్పన కుమారి (Kalpana Kumari ) , తిరుపతి జేసీగా, తుడా వైస్ చైర్మన్గా ఆర్.గోవిందరావుకుపోస్టింగ్ కల్పించింది.
కడప జాయింట్ కలెక్టర్గా నిధి మీనా, అనంతపురం జాయింట్ కలెక్టర్గా సి. విష్ణుచరణ్, అనకాపల్లి జాయింట్ కలెక్టర్గా మల్లవరపు సూర్యతేజ, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ పోస్టింగ్ కల్పించింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్గా శివ్ నారాయణ్ శర్మ, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా వి. సంజనా సింహ, విశాఖ జాయింట్ కలెక్టర్గా గొబ్బిళ్ల విద్యాధరి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం బదిలీ చేసింది.
వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా రోణంకి గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా శ్రీవాస్ నుపుర్ అజయ్కుమార్, గుంటూరు మున్సిపల్ కమిషనర్గా కతవాటె మయూర్ అశోక్ను, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్.ఎస్.శోబికను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది.