తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు ఒక కంపార్టుమెంట్లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 48,928 మంది భక్తులు దర్శించుకోగా 48,928 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చిందని తెలిపారు.
ధనుర్మాసం పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రవచనాలు కొనసాగుతాయనివివరించారు. దీంట్లో భాగంగా శనివారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరుగుతుందని తెలిపారు. ధనుర్మాసం ముగిసే వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్డులోని వరదరాజస్వామివారి ఆలయంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాలు పారాయణం జరుగుతాయని వివరించారు.