అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్తగా 12,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి . మరో 12 మంది కరోనా బారిన పడి చనిపోయారు. 8,742 మంది బాధితుల కరోనా నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,13,300 యాక్టివ్ కేసులున్నాయని వారు వివరించారు. 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,710 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 1,625, కడపలో 1,215, విశాఖలో 1,211, తూర్పు గోదావరిలో 1,067 , కృష్ణా జిల్లాలో 1,056, నెల్లూరు జిల్లాలో 1,009 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్నటి కంటే వెయ్యి కేసులు ఈరోజు తగ్గుముఖం పట్టాయి.