తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 11 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీరికి 12 గంటలో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 74,412 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 27,626 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.27 కోట్లు వచ్చిందని తెలిపారు.