తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శన సమయం పడుతుందని టీటీడీ అధికారు లు తెలిపారు. నిన్న స్వామివారిని 69,012 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చిందని వివరించారు.