Waterfall | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం వద్ద సందర్శనకు వెళ్లిన 11 మంది పర్యాటకుల ఆచూకీ గల్లంతైంది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో దాని ఉధ్రుతికి పర్యాటకులు కొట్టుకు పోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే రోప్ల సాయంతో పోలీసులు, అగ్ని మాపక దళ సిబ్బంది గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే, వారు సురక్షితంగా ఉన్నట్లు వార్తలొచ్చాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారు ఏయే ప్రాంతాల నుంచి జలపాతం వద్దకు వచ్చారన్న వివరాలు తెలియాల్సి ఉన్నది.