నెల్లూరు: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని సముద్రంలో వేటకు వెళ్లిన 11 మంది జాలరులు సముద్రంలో చిక్కుకున్నారు. వీరంతా అల్లూరు మండలం తాటిచెట్ల పాలెం వాసులుగా గుర్తించారు. వీరిని ఒడ్డుకు చేర్చేందుకు కృష్ణపట్నం కోస్టుగార్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని 4 మండలాల్లో 2850 ఎకరాల్లో వరి నాట్లు నీట మునిగాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.