అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhara Pradesh) లో ఈనెల 3 నుంచి 18 వ తేదీవరకు పదో తరగతి(Tenth Exams) ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa) తెలిపారు. ఈ సంవత్సరం నుంచి పదో తరగతిలో ఆరు పేపర్ల (Six Papers)విధానంలో పరీక్షల ఉంటాయని తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని వివరించారు.
పరీక్షలు జరిగే 3,349 పరీక్ష కేంద్రాల్లోని పాఠశాలలకు రెండు పూటల సెలవులిస్తున్నట్లు బొత్స తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు హాల్ టికెట్ల ఆదారంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం 6,09,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. వీరిలో బాలురు 3,11,329 మంది, బాలికలు 2,97,741 పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. వేసవికాలం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.