అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి వరకు మొత్తం 103 మంది బ్లాక్ ఫంగస్తో మృతిచెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటివరకు 1,551 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. బ్లాక్ఫంగస్ చికిత్స ఔషధాలను కేంద్రం కేటాయిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 13,105 ఇంజెక్షన్లను మాత్రమే రాష్ట్రానికి ఇచ్చిందని, 91,650 ఇంజెక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసిందని చెప్పారు. ప్రస్తుతం 1,225 డోసులు మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. అక్కడ వైద్య సౌకర్యాలు పెంచాలని ఆదేశించారని ఏకే సింఘాల్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.