తిరుమల : తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 62,449 మంది దర్శించుకోగా 18,555 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకల వల్ల టీటీడీ హుండీకి రూ. 3.45 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.