తిరుమల : తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 87,692 మంది భక్తులు దర్శించుకోగా 36,832 తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.30 కోట్లు వచ్చిందని వివరించారు.